సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు

Update: 2020-11-30 11:00 GMT

అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై వ్యంగాస్త్రాలు సంధించారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. మా రాజా ఇది కాయిన్ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి రావటం లేదన్నారు. గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా జగన్ అక్కడ ఉండేవాడన్నారు.

ఈ మనిషి ఇప్పుడు వచ్చి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక విమానాలు..హెలికాప్టర్లు కూడా లేవన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా తమ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వంలో ఏ రైతు కూడా కన్నీరు పెట్టకూడదని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామన్నారు.

Tags:    

Similar News