ఐఏఎస్‌ల జైలుశిక్షను రీకాల్‌ చేసిన ఏపీ హైకోర్టు

Update: 2021-06-22 14:56 GMT

హైకోర్టు ఆదేశాల‌ను విస్మ‌రించిన ఐఏఎస్ ల‌కు షాకిచ్చిన హైకోర్టు త‌ర్వాత వారికి ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకుంది. ఏఎస్ లు గిరిజా శంక‌ర్, చిరంజీవి చౌద‌రిల‌కు తొలుత వారం రోజుల పాటు వేసిన జైలు శిక్షను కోర్టు రీకాల్‌ చేసింది.హైకోర్టు ఉత్వర్వులను రేపు సాయంత్రంలోగా అమలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది లిఖితపూర్వక హామీనిచ్చారు.దీంతో జైలు శిక్షను హైకోర్టు రీకాల్ చేసింది. జైలుశిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది.

Tags:    

Similar News