వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి

Update: 2020-10-04 11:50 GMT

షాకింగ్. కరోనాకు ఏపీకి చెందిన మరో నేత బలి అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తుది శ్వాసవిడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. ఆయన విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా ఉన్నారు. దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడే ద్రోణంరాజు శ్రీనివాస్‌. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు.

Similar News