ఇరవై నాలుగేళ్ళ యువకుడికి 12 కోట్ల లాటరీ

Update: 2020-09-22 08:11 GMT

జాక్ పాట్ అంటే ఇదే. 24 సంవత్సరాల యువకుడు. మూడు వందల రూపాయలు పెట్టి ఓ లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఈ యువకుడికి ఏకంగా 12 కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలింది. ఈ విషయాన్ని లాటరీ నిర్వాహకుల కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈ విషయాన్ని లాటరీ దక్కించుకున్న అనంతు విజయన్ తొలుత నమ్మలేదు. ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాడు. తర్వాత వార్తల్లో చెక్ చేస్తే అసలు విషయం తెలిసింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. అనంతు విజయన్ కేరళలోని కొచ్చిలోని ఓ గుడిలో క్లర్క్ గా పనిచేస్తున్నాడు.

తిరువోనమ్ బంపర్ లాటరీలో అతగాడు ఈ మొత్తం దక్కించుకున్నాడు.ఈ యువకుడు గుడిలో క్లర్క్ గా పనిచేస్తుంటే తండ్రి పెయింటర్ గా చేస్తున్నాడు. ఈ లాటరీతో కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన ఈ యువకుడు ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారిపోయాడు. అయితే పన్నులు.. ఏజెన్సీ కమిషన్ అన్నీ పోను అనంత్ కు నికరంగా చేతికి 7.56 కోట్ల రూపాయల రానున్నాయని స్థానిక పత్రికలు ప్రచురించాయి.

 

Similar News