నగరంలో శుక్రవారం నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శివార్లలో బస్సులు నడుస్తున్నా సిటీ సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా సిటీ బస్సు సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకేసారి మొత్తం కాకుండా దశల వారీగా సర్వీసుల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పటికే నగరంలో మెట్రో సర్వీసులు కూడా ప్రారంభం అయిన విషయం తెలిసిందే.