అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

Update: 2020-08-13 11:30 GMT

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే ఇదే విషయాన్ని హైకోర్టు కు తెలియజేసి అక్కడే చికిత్స అందించనున్నట్లు సమాచారం. దీంతో అచ్చెన్నాయుడు మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండనున్నారు. జలుబు ఉండటంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయించగా..కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం.

Similar News