ఒక్కసారి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాబోయే మూడు, నాలుగు నెలల కాలంలో కేంద్రం మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. డిమాండ్ మందకొడిగా ఉందంటే తదనుగుణంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డిమాండ్ తక్కువగా ఉండటం పలు విభాగాల్లో సామర్ధ్య వినియోగం పుంజుకోవటం లేదన్నారు.