అల్లు అర్జున్ తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. వీళ్ళిద్దరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం నాడు వెలువడింది. సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అల్లు అర్జున్ 21వ సినిమా. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరూ తమ తమ ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తారు.