చంద్రబాబు కారణంగా ఏపీ చాలా నష్టపోయింది

Update: 2020-06-08 06:40 GMT

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. బాబు వల్లే ఏపీ చాలా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారని..ఇందుకు సీఎం జగన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓటమిపై టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాది కాలంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ లో హామీలను అమలు చేయాలనే తాపత్రయం కన్పిస్తోందని అన్నారు.

రాజకీయాల్లో ప్రస్తుతం విలువలు లేవన్నారు. కొద్ది రోజుల క్రితమే కరణం బలరాం తన తనయుడితో కలసి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. బలరాం వైసీపీలో చేరితే ఆయన సభ్యత్వం పోయే అవకాశం ఉండటంతో ఆయన తనయుడిని మాత్రం వైసీపీలో చేర్చారు. ఇప్పుడు జగన్ కు అనుకూలంగా ప్రకటనలు చేయటంతోపాటు...టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది అసంతృప్తితో ఉన్నారని వార్తలు వెలువడుతున్న సమయంలో కరణం బలరాం ఇలా తెరపైకి వచ్చి టీడీపీపై విమర్శలు చేయటం విశేషం.

 

Similar News