రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కు చేరింది. బుధవారం నాడు కొత్తగా వచ్చిన 275 కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్యకు పెరిగాయి కేసులు. అయితే ఇందులో ఇప్పటికే 2906 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 90 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో ఏపీ సర్కారు ఏకంగా 15,188 టెస్ట్ లు నిర్వహించింది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. . కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,559 యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్ లో తెలిపారు.