ఆగస్టు నుంచి జగన్ పల్లెబాట

Update: 2020-06-11 15:15 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్లెబాట పట్టనున్నారు. ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలో ఆయన జిల్లాల పర్యటనలు చేసింది తక్కువే. అందుకే ఆగస్టు నుంచి మరోసారి జనం ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందటంలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని జగన్ తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత వినియోగించడం కాదని, వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సమీక్షించి ఆ మేరకు పర్యవేక్షణ చేయడమన్నది చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదన్నారు.

 

Similar News