ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

Update: 2020-05-15 06:34 GMT

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2157కు పెరిగింది. ఇందులో 1252 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. 48 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 857గా ఉన్నాయని సర్కారు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 14, తూర్పు గోదావరిలో 1, కడపలో 2, కృష్ణాలో 9, కర్నూలులో 8, నెల్లూరులో 14,విశాఖపట్నంలో 2, విజయనగరంలో మరో 3 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 9038 శాంపిళ్ళను పరీక్షించగా..అందులో 57 కేసులు పాజిటివ్ గా తేలాయి.

Similar News