ఏపీలో సేఫ్ జిల్లాలు శ్రీకాకుళం..విజయనగరమే

Update: 2020-04-04 13:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా సురక్షితంగా ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఏపీలో కొత్తగా మరో పది పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 190కి చేరింది. అత్యధిక గా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

జిల్లాల వారిగా కరోన పాజిటివ్ కేసుల వివరాలు...

1.అనంతపురం.. 3

2.చిత్తూరు.. 10

3.ఈస్ట్ గోదావరి.. 11

4.గుంటూరు.. 26

5.కడప.... 23

6.కృష్ణా.. 32

7.కర్నూలు.. 4

8.నెల్లూరు.. 32

9.ప్రకాశం.. 19

10.శ్రీకాకుళం.. 0

11.విశాఖపట్నం.. 15

12.విజయనగరం. 0

13.వెస్ట్ గోదావరి.. 15

 

Similar News