జగన్ కు కరోనా టెస్ట్

Update: 2020-04-17 13:26 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది నిమిషాల్లో వచ్చింది. సీఎం జగన్ కు నెగిటివ్ అని తేలింది. ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ ను ఈ స్ట్రిప్స్‌ పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి.

 

 

 

 

Similar News