కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన

Update: 2020-03-13 07:36 GMT

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. డోన్ లో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని..అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డోన్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేనందున తాము పోటీ చేయడం లేదని తెలిపారు. మరో వైపు కే ఈ కృష్ణమూర్తి సోదరుడు కే ఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Similar News