బాహుబలి హీరో ప్రభాస్ కూడా కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు చేపడుతున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖులు వరస పెట్టి విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.