కేశినేని వర్సెస్ ఏ బీ వెంకటేశ్వరరావు

Update: 2020-02-10 04:23 GMT

తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వర రావుల మధ్య ట్వీట్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. తాజాగా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ గెలుపునకు, టీడీపీ ఓటమికి కారణమైన ఏబీ వెంకటేశ్వరరావును సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ అంటే నాని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ టీడీపీ వర్గాల్లో కలకలం రేపిందనే చెప్పాలి. దీనిపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడకపోయినా ఏ బీ వెంకటేశ్వరరావు మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు.

‘మీరూ, మీరూ పార్లమెంట్‌లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి.నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్‌ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని ఏబి వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ల వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

 

 

Similar News