ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రధాని తో భేటీ ముగిసిన వెంటనే జగన్ ఏపీకి తిరిగొచ్చారు.
వాస్తవానికి ప్రధానితో భేటీ తర్వాతే అమిత్ షాతో కూడా సమావేశం కావాలనుకున్నా హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. శుక్రవారం సాయంత్రం అమిత్ షా అపాయింట్ ఖరారు కావటంతో జగన్ రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు.