ఏపీలో మళ్ళీ ఐటి దాడుల కలకలం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఇంటిపై పది మందితో కూడిన ఐటీ అధికారుల టీమ్ ఈ దాడులు ప్రారంభించింది. శ్రీనివాసుల రెడ్డి ఇంట్లోని పలు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన అంశంపై ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
కంపెనీ ద్వారా వచ్చే ఆధాయం, పన్ను చెల్లింపుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోందని చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.