తీగలాగారు..డొంక కదులుతుంది

Update: 2020-02-16 11:32 GMT

ఐటి దాడుల వ్యవహారంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి అధికారులు తీగ లాగారని..డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల వ్యవహారం మీడియా, పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదన్నారు. దాడుల్లో వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ సంస్థలు ముందుకెళతాయని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నిరంతరం పనిచేయాలన్నారు.

ఏపిలో జరిగిన వాటిని పట్టుకుని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. కేంద్ర సంస్థలు సమర్దంగా పనిచేయకుండా ఉండే వాతావరణాన్ని గత ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందని ఆయన అన్నారు.ఆడిటర్లు, ఆడ్వకేట్లు దీనిని పెద్ద అంశంగానే భావిస్తున్నారని వీర్రాజు తెలిపారు.

 

Similar News