ట్రంప్ ప్రసంగంలో హైదరాబాద్ ప్రస్తావన

Update: 2020-02-24 13:12 GMT

రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అహ్మదాబాద్ లోని ‘మొతెరా’ స్టేడియం ఘన స్వాగతం పలికింది. ఈ వేదికపై నుంచి మాట్లాడిన అగ్రరాజ్యాధినేత అయిన ట్రంప్ ‘హైదరాబాద్’ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి కారణం ఆయన కుమార్తె. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి. 2017 నవంబర్ లో డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ‘అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు’లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు.

ఇదే విషయాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇవాంక హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అప్పట్లో ప్రభుత్వం నగరంలోని పలు రోడ్లను సుందరంగా తీర్చిదిద్దింది. దీనిపై సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా వచ్చాయి. మా ఏరియాలో రోడ్లు బాగుపడాలంటే ఇక్కడకు ఇవాంకా రావాలా? అంటూ వ్యంగాస్త్రాలు కూడా సంధించిన విషయం తెలిసిందే.

 

 

 

Similar News