భరత్ నగర్ బ్రిడ్జి నుంచి పడిన కారు

Update: 2020-02-18 06:10 GMT

హైదరాబాద్ లో కారు ప్రమాదాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే బయోడైవర్సిటీ పార్కు దగ్గర ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున అలాంటిదే మరో ప్రమాదం. అయితే ఈ సారి సంఘటన జరిగింది భరత్ నగర్ బ్రిడ్జి దగ్గర. ఈ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళుతున్న కారు ఒకటి రెయిలింగ్ ను ఢీకొట్టి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి అక్కడకు అక్కడే మరణించారు.

మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంతో జరిగినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు బోరబండ పండిట్‌ నెహ్రూనగర్‌కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

 

Similar News