‘జబర్దస్త్’ నుంచి నాగబాబు బయటకు

Update: 2019-11-21 15:44 GMT

టెలివిజన్ మార్కెట్ లో వీక్షకుల పరంగా ‘జబర్దస్’ షోకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈ షో నేరుగా టీవీ ద్వారా చూసే ప్రేక్షకులు ఒకెత్తు అయితే..యూట్యూబ్ లో కూడా జబర్ధస్ట్ షోకు ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ షోలో జడ్జీలుగా వ్యవహరించే నాగబాబు, రోజాలది కూడా ఇందులో కీలక పాత్రే. వీరితోపాటు యాంకర్లుగా రష్మి, అనసూయలు బబర్దస్త్ షోను కలర్ ఫుల్ గా చేస్తారు. నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు గత కొంత కాలంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ ప్రకటన చేశారు. అందులోని ముఖ్యాంశాలు. ఈ శుక్రవారం ఎపిసోడ్‌తో జబర్దస్త్‌ లో తన జర్నీ ముగుస్తుందని చెప్పారు. ‘నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంటో ఎవరి తప్పు లేదు. జబర్దస్త్‌ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డికి థ్యాంక్స్‌. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్‌ లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గట్లు కాకపోయినా మంచి రెన్యూమరేషన్‌ ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. రెమ్యూనిరేషన్‌ విషయంలో విభేదాలు వచ్చి వెళ్లిపోయాడనేది అబద్ధం. నేను పారితోషికం కోసమే జబర్దస్త్‌ కి రాలేదు. నాకు అది పెద్ద విషయమే కాదు. హాలిడే ట్రిప్పులా ఇన్ని రోజులు షో నడిచింది. ఈ విషయంలో మరోసారి శ్యాంప్రసాద్‌రెడ్డి ధన్యవాదాలు చెబుతున్నాను. నా జర్నీ ఎలా మొదలైంది. ఎలా క్లోజ్‌ అయిందనేది తర్వాత రోజుల్లో చెబుతాను’ అని నాగబాబు వెల్లడించారు.

 

 

 

Similar News