రామ్ చరణ్ కు అరుదైన గౌరవం

Update: 2024-04-13 16:26 GMT

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ కు తమిళ నాడు కు చెందిన వేల్స్ యూనివర్సిటీ శనివారం నాడు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అట్టహాసంగా జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమం లో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన యూనివర్సిటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

                                            Full Viewగత 38 సంవత్సరాలుగా ఈ యూనివర్శిటీ విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు కొత్తగా దర్శకుడు బుచ్చి బాబు తో కలిసి మరో కొత్త సినిమా షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా లో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News