ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు

Update: 2019-08-05 07:45 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు. దీంతో జమ్మూ కాశ్మీర్ కు ఇంత కాలం కొసాగిన స్వయంపత్రి రద్దు అయిపోయింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఎలాగో..ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా అలాగే. దేశంలో వర్తించి అన్నీ చట్టాలు..ఇప్పుడు అక్కడ వర్తిస్తాయి. కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ మద్దతు ఇచ్చింది.

ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీని వల్ల కాశ్మీర్ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంతటి సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు తమ పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వైసీపీతో పాటు బిఎస్పీతోపాటు మరికొన్ని పార్టీలు మద్దతు పలికాయి.

 

Similar News