ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై బిజెపి దూకుడు పెంచింది. జగన్ సర్కారు గత ఐదేళ్ల చంద్రబాబు పాలన అవినీతిపై విచారణ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవదర్ కోరారు. సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి కరకట్టపై వున్న ఇంటిని ఖాళీ చేయిస్తే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండు సంవత్సరాల్లోనే ఆయన జైలుకెళ్తారని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరేందుకు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.