వైసీపీపై కేశినేని నాని వ్యంగాస్త్రాలు

Update: 2019-07-10 07:59 GMT

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ సారి సీఎం జగన్, వైసీపీ ఎంపీలను టార్గెట్ చేశారు. కేంద్రం మెడలు వచ్చి రాష్ట్రానికి బడ్జెట్ లో 21 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్ సాధించారని ఎద్దేవా చేశారు. ఇంత ఘనత సాధించిన జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా గ్రేట్ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంగళవారం నాడు సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఇప్పుడు టీడీపీకి కావాల్సింది పనిచేసేవాళ్లు..షో మాస్టర్లు కాదంటూ వ్యాఖ్యానించి కలకలం రేపిన నాని..మరుసటి రోజు అధికార పార్టీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

Similar News