ప‌య్యావుల కేశ‌వ్ రాజీనామా

Update: 2019-06-04 13:14 GMT

తెలుగుదేశం నేత ప‌య్యావుల కేశ‌వ్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి మంగ‌ళ‌వారం నాడు రాజీనామా చేశారు. తాజాగా ఆయ‌న ఉర‌వకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌దులుకున్నారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Similar News