గత రెండు రోజులుగా టీవీ9లో చోటు చేసుకుంటున్న పరిణామాలు శుక్రవారం నాడు కొత్త మలుపు తిరిగాయి. కొత్త యాజమాన్యం సీఈవో రవిప్రకాష్ పై వేటు వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన యాజమాన్యం కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను నియమించింది. అదే సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా సింగారావును నియమించారు. శుక్రవారం నాడు సమావేశమైన ఏబీసీఎల్ డైరక్టర్లు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందనే సమాచారం అందుతోంది. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై కొత్త యాజమాన్యం పలు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన టీవీ9 కార్యాలయానికి శుక్రవారం కూడా హాజరయ్యారు. సిబ్బందితో కూడా కొద్ది సేపు సమావేశం అయ్యారు. నూతన యాజమాన్యం సంస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.