సుమంత్ మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఆయనకు మళ్ళీ రావా సినిమా ఓ బ్రేక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదం జగత్ అంటూ ముందుకు రాబోతున్నారు. ఈ కొత్త సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అంజు కురియన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతర పనులు జోరుగా సాగుతున్నాయి. సుమంత్ ఈ చిత్రంలో తన కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని చెబుతోంది చిత్ర యూనిట్. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్ ను సర్ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్ గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్గా నిలుస్తుంద’ని తెలిపారు.