కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చారు. అందులో ఒకరు రేవంత్ రెడ్డి అయితే..మరొకరు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఆశించగా..ఆయన పార్టీ అధిష్టానం మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది. రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ పదవి ఇవ్వొద్దని చాలా మంది సీనియర్లు అధిష్టానం వద్ద పోరారు. వారి పోరాటం ఫలించినట్లే కన్పిస్తోంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారు. అయితే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అప్పుడే అసంతృప్త స్వరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి పలు నూతన కమిటీలను ప్రకటించారు. ఆ కమిటీల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఈ కమిటీల్లో ఓ పెద్ద పొరపాటు చోటుచేసుకుంది. ఈ మద్యే టీఆర్ఎస్లో చేరిన సురేశ్ రెడ్డి పేరును కూడా కో- ఆర్డినేషన్ కమిటీలో చేర్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
కోర్ కమిటీ
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్తో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్, జి. చిన్నారెడ్డి, ఎ. సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలు కోర్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
కో- ఆర్డినేషన్ కమిటీ
53 మందితో ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా కుంతియా, కన్వీనర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనుండగా... మిగతా అన్ని కమిటీల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ప్రచార కమిటీ
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క నియమితులు కాగా.. కో- చైర్పర్సన్గా డీకే అరుణ, కన్వీనర్గా దాసోజు శ్రవణ్ వ్యవహరించనున్నారు. వీరితో పాటుగా మరో 14 మంది సభ్యులు ఉంటారు.
మేనిఫెస్టో కమిటీ
కమిటీ చైర్మన్ : మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
కో- చైర్పర్సన్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కన్వీనర్ : బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
వీరితో పాటుగా మరో 32 మంది సభ్యులు కూడా ఉంటారు.
స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ
కమిటీ చైర్మన్ : వి. హనుమంతరావు,
కో- చైర్పర్సన్లు : సర్వే సత్యనారాయణ, మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు,
కన్వీనర్ : పొంగులేటి సుధాకర్ రెడ్డి
మరో 15 మంది కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ
చైర్మన్ : మర్రి శశిధర్ రెడ్డి
కో- చైర్పర్సన్ : కమలాకర్ రావు
కన్వీనర్ : జి. నిరంజన్
వీరితో పాటుగా మరో ఆరుగురు సభ్యులు
డిసిప్లినరీ యాక్షన్ కమిటీ
చైర్మన్ : ఎం. కోదండరెడ్డి
కో- చైర్పర్సన్ : ఎ. శ్యాంమోహన్
కన్వీనర్లు : బి. కమలాకర్ రావు, నంది ఎల్లయ్య, సంభాని చంద్రశేఖర్, పి. బలరాం నాయక్, సీజే శ్రీనివాసరావు