‘ధడక్’ మంటున్న శ్రీదేవి కూతురు

Update: 2018-06-11 08:34 GMT

శ్రీదేవి కూతురు జాన్వి ప్రేక్షకులను ‘ధడక్’ మన్పిస్తోంది. దుబాయ్ లో జరిగిన ప్రమాదంలో శ్రీదేవి మరణించక ముందే ఈ సినిమా మొదలైంది. కానీ ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వి హీరోయిన్ గా నటించిన సినిమా ధడక్ కు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది. ఇందులో ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్‌ ఖైటన్‌ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. మధుకర్‌, పార్వతి పాత్రల్లో ఇషాన్‌, జాన్వీలు అలరించనున్నారు.

ట్రైలర్ లో హీరో; హీరోయిన్లు ఇద్దరూ ఎంతో ఆకట్టుకున్నారు. సినిమా ఎంత రిచ్ గా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు. ‘ఎప్పుడైతే రెండు వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయో.. అవి ఒక్కటిగా మారిపోవటం ఖాయం’ అంటూ దఢక్‌ కాన్సెప్ట్‌ ను పరిచయం చేశారు. మరాఠీ హిట్‌ సైరాట్‌కు రీమేక్‌ ఈ ధడక్ సినిమా. జూలై 20న దఢక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=TIE92mUvSsw

Similar News