జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మీడియా మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఇఫ్పటికే పవన్ కు టీవీ9లో ప్రధాన వాటాదారు అయిన శ్రీనిరాజు లీగల్ నోటీసులు పంపారు. ఇప్పుడు అదే జాబితాలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా చేరారు. ఆయన తాజాగా పవన్ కు లీగల్ నోటీసులు పంపారు. భేషరతు క్షమాపణ చెప్పటంతోపాటు...ట్విట్టర్ లో తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను తొలగించాలని కోరారు. లేదంటే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.