సైబర్ నేరగాళ్లకు ఇప్పుడు ఇది ఒక పెద్ద అస్త్రంగా మారినట్లు ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాల ద్వారా ఏకంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల మేర స్కాం లు చేసారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏఐ తో చోటు చేసుకుంటున్న ఈ వాయిస్ స్కాం లు ఇప్పుడు పెద్ద సవాలుగా మారబోతున్నాయి. ఎందుకంటే ఫోన్ లో అవతల వ్యక్తి మాట్లాడే మాటలు ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా ఉండేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినట్లు...లేదంటే ఇతర పనుల కోసం మాట్లాడుతున్నట్లు చెపుతూ వాయిస్ క్లోనింగ్ తో డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వాయిస్ క్లోనింగ్ అంశం రాజకీయ నాయకులకు ఒక అస్త్రంగా...అదే సమయంలో ఒక ప్రమాదంగా కూడా మారే అవకాశం లేక పోలేదు అని చెపుతున్నారు.