చుక్క‌లు చూపించిన విస్తారా విమానం

Update: 2021-06-07 15:59 GMT

ముంబ‌య్ నుంచి కోల్ క‌తా బ‌య‌లుదేరిన‌ విస్తారా ఎయిర్ లైన్స్ విమానం ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపించింది. కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుంది అన‌గా...ఒక్క‌సారిగా భారీ కుదుపులు వ‌చ్చాయి. దీంతో విమానంలో ఉన్న వారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అదే స‌మ‌యంలో కుదుపుల‌కు ప‌లువురు గాయాల పాల‌య్యారు. భారీ కుదుపుల‌తో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించినట్లు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి విమానంలోనే ప్రథమ చికిత్స అందించి కోల్‌కతా చేరుకున్న తరువాత ఆస్పత్రికి తరలించామ‌న్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.

Tags:    

Similar News