దీప్ సిద్ధూ అరెస్ట్

Update: 2021-02-09 04:07 GMT

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ దీప్ సిద్దు అరెస్ట్ అయ్యారు. ఎర్రకోట ముట్టడి వెనక ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. కొంత మంది రైతులను రెచ్చగొట్టి పోలీసులు ఆమోదించిన మార్గంలో కాకుండా ఎర్రకోట వైపు వెళ్ళేలా ఆయన ప్రోత్సహించారని అభియోగాలు ఎధుర్కొంటున్నారు.

దీంతోపాటు హింసను ప్రేరేపించటంలో ఆయన పాత్ర ఉందని రైతు సంఘాల నేతలు కూడా ఆరోపించారు. అదే సమయంలో దీని వెనక బిజెపి ప్రోత్సాహం ఉందంటూ సిద్ధూ గతంలో ప్రధాని నరేంద్రమోడీతో కలసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పటి నుంచి సిద్ధూ కన్పించకుండా పోయారు. అయితే మంగళవారం నాడు సిద్ధూను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News