ఆ జాబితాలో రజని కాంత్ కూడా

Update: 2024-05-24 09:57 GMT

ప్రముఖ నటుడు రజనీకాంత్ కు ప్రతిష్టాత్మకమైన యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. యూఏఈ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆయనకు ఈ వీసా మంజూరు చేసింది. తనకు గోల్డెన్ వీసా జారీ చేయటంపై రజని కాంత్ యూఏఈ ప్రభుత్వంతో పాటు ఈ వీసా దక్కటానికి సహకరించిన లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రజనీకాంత్ ఎక్స్ లో ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల యూఏఈ లో పర్యటించిన రజనీకాంత్ ఈ వీసా అందుకుని..లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ నివాసాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆతిధ్యం స్వీకరించి..అక్కడే యూసుఫ్ అలీ కి చెందిన విలాసవంతమైన కారు లో చక్కర్లు కూడా కొట్టారు.

                                  Full Viewరజనీకాంత్, లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ లు ఎప్పటినుంచో స్నేహితులు. అందుకే గోల్డెన్ వీసా జారీ విషయంలో రజనీకాంత్ కు ఆయన తన వంతు సహకరించారు. రజనీకాంత్ కంటే ముందు భారత్ లోని బాలీవుడ్ ప్రముఖులు , ఇతర సెలెబ్రిటీలు కూడా యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. అందులో షారుఖ్ ఖాన్ తో పాటు సంజయ్ దత్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, బోనీ కపూర్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, సానియా మీర్జా, సోనూ సూద్, సునీల్ శెట్టి తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News