బాబోయ్ ఎంత బంగారమో !

Update: 2024-08-23 15:15 GMT

Full Viewప్రతి రోజు తిరుమలకు వేల మంది భక్తులు వస్తారు. కానీ శుక్రవారం నాడు అంటే ఆగస్ట్ 23 న మాత్రం అందరి కళ్ళు వీళ్ళమీదే నిలిచాయి. దీనికి ప్రధాన కారణం ఈ భక్తులు ఏకంగా కిలోలకు కిలోల బంగారం ధరించి మరీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటమే. మొత్తం ముగ్గురు వ్యక్తులు 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల వచ్చారు. ఇంత బంగారం వేసుకుని రావటం అంటే మాములు విషయం కాదు కదా...అందుకే వీరికి రక్షణగా పదిహేను మంది భద్రతా సిబ్బంది కూడా వచ్చారు.

                                   మహారాష్ట్రకి చెందిన వీళ్ళు మెడలో పెద్ద పెద్ద సైజు లో ఉన్న గొలుసులు వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వీళ్ళతో చాలా మంది భక్తులు సెల్ఫీలు దిగటానికి ఆసక్తి చూపించారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పది కిలోల లెక్కన బంగారు ఆభరణాలు ధరిస్తే..ఒక్కరు మాత్రం ఐదు కిలోల నగలు వేసుకున్నారు. ఈ బంగారు భక్తుల ఫోటోలు శుక్రవారం నాడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.. 

Tags:    

Similar News