ఎయిర్ ఇండియా, ఇండిగో తో కలుపుకుని పలు ఎయిర్ లైన్స్ 1115 విమానాల కొనుగోలుకు ఆర్డర్ లు ఇచ్చాయి. దేశ జనాభా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువ అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. అమెరికా జనాభానే 31 కోట్లు అయితే ..భారత్ లో మధ్య తరగతి ప్రజలే 44 కోట్ల మేర ఉన్నారని...ఈ లెక్కన రాబోయే సంవత్సరాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య అటు దేశీయంగా...విదేశీ మార్గాల్లోనూ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. వచ్చే పది సంవత్సరాల్లో కేవలం విదేశీ ప్రయాణికుల సంఖ్య 12 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది అని అంచనా. దీంతో దేశీయ విమానయాన సంస్థలు మరిన్ని వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు.