ఈ పరిస్థితి అనిశ్చితికి దారి తీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న ఒత్తిడి కారణంగా అమెరికాలో మాంద్యం తలెత్తే అవకాశాలు ఉన్నాయని మిన్నియాపోలిస్ ఫెడ్ ప్రెసిడెంట్ నీల్ కష్కరి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల వల్ల నిధుల కొరత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిధుల కొరత పలు రంగాలకు విస్తరించి ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీయవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకు లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ కూడా అప్రమత్తం అయింది. దేశ బ్యాంకింగ్ రంగానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదని చెపుతున్నా ఆర్ బీఐ ఇప్పటికే బ్యాంకు లకు పలు సూచనలు చేసింది.