తర్వాత కొద్దిగా కోలుకొని 4389 పాయింట్ల నష్టంతో 72089 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లతో పాటు పలు కీలక కంపెనీల షేర్లు నష్టాల బాట పడితే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ లో మాత్రం ర్యాలీ కొనసాగింది. ఒక దశలో హెరిటేజ్ షేర్లు 55 రూపాయల లాభంతో 52 వారాల గరిష్ట స్థాయికి 480 రూపాయలకు చేరింది. తర్వాత ముప్పై రూపాయల లాభంతో 456 రూపాయల వద్ద ముగిసింది. మార్కెట్ల క్రాష్ లో కూడా హెరిటేజ్ షేర్లు పెరగటం కీలకంగా మారింది.