టీడీపీ కూటమి విజయం...హెరిటేజ్ ఫుడ్స్ లో జోష్!

Update: 2024-06-04 13:22 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కూటమి విజయాన్ని సాధిస్తుంది అని ఎక్కువ మంది భావించారు. కానీ ఈ స్థాయి విజయం మాత్రం ఎవరూ ఊహించలేదు అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ఘన విజయం సాధించటమే కాదు...ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కారు కు టీడీపీ మద్దతు కూడా అత్యంత కీలకం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తప్పి కేంద్రంలో ఎన్ డీఏ కూటమి రూపంలో మాత్రమే మెజారిటీ కి చేరువగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం నాడు దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 6100 పాయింట్ల మేర నష్టపోయింది.

                                                   తర్వాత కొద్దిగా కోలుకొని 4389 పాయింట్ల నష్టంతో 72089 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లతో పాటు పలు కీలక కంపెనీల షేర్లు నష్టాల బాట పడితే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ లో మాత్రం ర్యాలీ కొనసాగింది. ఒక దశలో హెరిటేజ్ షేర్లు 55 రూపాయల లాభంతో 52 వారాల గరిష్ట స్థాయికి 480 రూపాయలకు చేరింది. తర్వాత ముప్పై రూపాయల లాభంతో 456 రూపాయల వద్ద ముగిసింది. మార్కెట్ల క్రాష్ లో కూడా హెరిటేజ్ షేర్లు పెరగటం కీలకంగా మారింది. 

Tags:    

Similar News