ఆధార్..పాన్ అనుసంధాన గడువు పెంపు

Update: 2021-03-31 15:19 GMT

కేంద్రం మరోసారి గడువు పొడించింది. ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను అందరూ మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలని తొలుత గడువు పెట్టారు. ఈ గడువు లోగా అనుసంధానం పూర్తి చేయకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు. అయితే గడువు చివరి తేదీ రోజు కోట్లాది మంది దీనికి క్యూకట్టడంతో ఐటి శాఖ వెబ్ సైట్ క్రాష్ అయింది.

దీంతోపాటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు మరింత వెసులుబాటు ఇస్తూ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం 2021జూన్ 30లోగా అందరూ పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News