వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి మృతి

Update: 2020-10-03 05:04 GMT

వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈ సీ గంగిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం సీఎం జగన్ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న గంగిరెడ్డిని పరామర్శించి వెళ్లిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా సేవలు అందించారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు.

Similar News