ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

Update: 2020-09-13 07:01 GMT

ఐదుగురు ప్రధాన కార్యదర్శులు

కొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజు

ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది మంది ఉపాధ్యక్షులు ఉండగా..ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, మరో ఐదుగురు కార్యదర్శులుగా ఉన్నారు. మొత్తం 40 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పీ వీ ఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, లోకుల గాంధీ, సూర్యనారాయణరాజు, ఎన్. మధుకర్ లను నియమించారు.

ఉపాధ్యక్షులుగా రేలంగి శ్రీదేవి, కాకు విజయ లక్ష్మి, మాలతి రాణి, నిమ్మక జయరాజు, పైడి వేణుగోపాల్, విష్ణకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్ బాబు, సురేందర్ రెడ్డి, చంద్రమౌలి ఉన్నారు. కార్యదర్శులుగా ఎస్. ఉమా మహేశ్వరి, కాండ్రిక ఉమ, మత్తం శాంతికుమార్, ఏ. కమల, కె. చిరంజీవి రెడ్డిని నియమించారు. ఐదుగురిని అధికార ప్రతినిధులుగా నియమించారు.

 

Similar News