మాస్క్ ల సరఫరాలోనూ స్కామ్

Update: 2020-06-23 15:04 GMT

వైసీపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ ల తయారీలోనూ వైసీపీ స్కామ్ లు చేస్తోందని ఆరోపించారు. 108 అంబులెన్స్ ల్లో 307 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. అంబులెన్స్ ల కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడిది కాదా?. సరస్వతి పవర్ మీ సొంత కంపెనీ అవునా..కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు మంగళవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో సర్కారు కుంభకోణాలు, వేధింపులు ఆపటంలేదన్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇంత కంటే సాక్ష్యాలు ఏమి కావాలని ప్రశ్నించారు.

Similar News