జగన్ సర్కారుపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-06-03 10:53 GMT

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు చుక్కెదురు కావటంతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు బిజెపి, సీపీఐ నేతలు కూడా సర్కారు తీరును తప్పుపట్టారు. బిజెపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాల్లో రంగులు నింపాలి కానీ..భవనాలకు రంగులు వేయాల్సిన అవసరం లేదన్నారు. జగన్ సర్కారు ఇకకైనా దూకుడు తగ్గించుకుంటే బాగుంటుందని సూచించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్దారించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని అన్నారు.

 

Similar News