టీడీపీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2020-05-30 11:56 GMT

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో మళ్లీ అధికారంలోకి వైసీపీనే వస్తుందా..లేక జనసేన, బిజెపి వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం పార్టీ మాత్రం రాదని నా గట్టి నమ్మకం. టీడీపీ ప్రభుత్వ హయాం లో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు. అభివృద్ధి అంతా ఆనుకూల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది’ అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి గ్రౌండ్ లో కన్పించేది చాలా తక్కువ అని..కానీ అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ఈ ట్విట్టర్ ఏమి సరిపోతుంది. లక్ష పేజీల గ్రంధాలే రాయోచ్చు.

అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్లు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి భ్రమల్లోంచి బయటకి రావాలి.లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే వాళ్ళకు స్వాగతం. కానీ మానసిక శాస్త్రంలో అలాంటి వాటిని భ్రాంతి అంటారు. మీ భ్రాంతికి ఆల్ ది బెస్ట్. ప్రజారోగ్య హెచ్చరిక అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘పిచ్చి కుక్కలతో వ్యవహారం ప్రమాదకరం. వాటిని బంధించాలి లేదా ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి. కానీ వాటిపట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అసలే ఇది పిచ్చికుక్కల కాలం’’ అని పేర్కొన్నారు.

 

Similar News