ఏపీకి చేరుకున్న చంద్రబాబు

Update: 2020-05-25 10:57 GMT

సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అమరావతిలో నివాసం ఉంటున్నా వారం వారం హైదరాబాద్ వచ్చే చంద్రబాబు అలాగే వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయారు. ఏపీ డీజీపీ నుంచి అనుమతి పొంది విశాఖపట్నం వెళ్ళి అటు నుంచి అమరావతిలోని కరకట్ట నివాసానికి చేరాల్సిన చంద్రబాబు..విమానాల రద్దుతో రోడ్డుమార్గంలో నేరుగా విజయవాడకే వెళ్ళారు. మార్గమధ్యంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గుమిగూడిన తెలుగు దేశం శ్రేణుల వద్ద వాహనం ఆపి..వారికి అభివాదం చేయటం వివాదానికి కారణం అయింది.

ఇది లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. మార్చి 20న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో చంద్రబాబు తన కుటుంబంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. సోమవారం నాడు అమరావతి చేరుకుని అక్కడ నుంచే మహానాడు నిర్వహణకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహించే విషయం తెలిసిందే.

 

 

 

Similar News