చంద్రబాబుపై పేర్నినాని సంచలన ఆరోపణలు

Update: 2020-03-09 13:29 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు యెస్ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ కు ఉన్న సంబందాలపై కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని, బ్యాంకు సంక్షోభంలో చంద్రబాబు పాత్ర ఉంటే అరెస్టు చేయాలని ఆయన అన్నారు.ఎస్ బ్యాంక్ నుంచి కమిషన్ లు పొందడమే కాకుండా, తన వద్ద ఉన్న డబ్బును విదేశాలకు తరలించుకోవడానికి చంద్రబాబు దీనిని వాడుకుని ఉండవచ్చని మంత్రి ఆరోపించారు.అన్నిటి గురించి మాట్లాడే చంద్రబాబు యెస్ బ్యాంక్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నాని ప్రశ్నించారు.

దివాళా తీస్తున్న యెస్ బ్యాంక్ స్కామ్ వెనుక కరకట్ట ఇంటిపాత్ర కూడా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. యెస్ బ్యాంక్ చైర్మన్ రాణా అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కరకట్ట ఇంటిలో ఒక రోజు గడిపారని కూడా తమకు సమాచారం వస్తోందని ఆయన అన్నారు. టిటిడి డబ్బు 1300 కోట్లు యెస్ బ్యాంక్ లో పెట్టడమే కాకుండా, టూరిజం మిషన్ డాక్యుమెంట్ అని, డిల్లీలో పెట్టుబడుల సదస్సు అని యెస్ బ్యాంక్ తో కలిపి పలు కార్యక్రమాలు నిర్వహించారని ఆయన చెప్పారు.

Similar News