టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా

Update: 2020-03-09 06:45 GMT

మూడు రాజధానుల బిల్లు సమయంలోనే తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలం క్రితం ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అదిష్టాన వైఖరికి మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశానని ఆయన ప్రకటించారు. పార్టీ అదినేతను కలవడానికి ప్రయత్నించినా, తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన అంటున్నారు.

తన అనుచరులకు ఆయన ఈ సందర్భంగా ఒక లేఖ రాసి తన రాజీనామా కారణాలు వివరించారు.గతంలో డొక్కా రెండుసార్లు ఎమ్మెల్యేగా , వైఎస్ , ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాలలో పనిచేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానన్నారు. కానీ వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ కోసమే పని చేస్తాను అని తన లేఖలో పేర్కొన్నారు.

 

 

Similar News